అలా నటించడం కంటే ఐటమ్ సాంగులే బెటర్ : హంసా నందిని

మంగళవారం, 26 మే 2020 (16:40 IST)
మోడల్ నుంచి సినీ నటిగా కెరీర్‌ను ప్రారంభించిన మరాఠీ భామ హంసానందిని. ఈమె అసలు పేరు పూనమ్. సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తర్వాత ఆన పేరును మార్చుకుంది. 2004లో వచ్చిన "ఒక్కటవుదాం" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత 2018లో వచ్చిన "పంతం" చిత్రం తర్వాత ఈ మహారాష్ట్ర భామ వెండితెరపై కనిపించలేదు. దీనికి గల కారణాలను ఈ ముద్దుగుమ్మ తాజాగా వెల్లడించింది. 
 
మొదటి నుంచి తనకు సినీ కెరీర్‌లో రొటీన్ పాత్రలే వచ్చాయని చెప్పింది. అలాంటి పాత్రలు చేయడం ఇష్టంలేకే ఐటమ్ సాంగుల వైపు దృష్టి మళ్లించినట్టు చెప్పుకొచ్చింది. ప్రాధాన్యత లేని హీరోయిన్ పాత్రల కంటే ఐటెం సాంగులే బెటర్ కదా అని ప్రశ్నించింది. 
 
స్పెషల్ సాంగులు రొటీన్‌కు భిన్నంగా వేటికవే ప్రత్యేకంగా ఉంటాయని చెప్పింది. తనకు సాంగ్స్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని... అందుకే స్పెషల్ సాంగ్స్ చేస్తున్నానని తెలిపింది. 
 
మరోవైపు తెలుగుతో పాటు తమిళం, కన్నడ చిత్రాలలో నటించిన హంసానందిని ఇపుడు ఐటమ్ సాంగులకే పరిమితమైంది. ఎన్నో సినిమాల్లో తన ఐటెం సాంగుల ద్వారా ఆమె ప్రేక్షకులను మైమరపించింది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా ఆమె ఇంటికే పరిమితమైంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు