శ్రీదేవి మరణంపై అమితాబ్ సిక్స్త్ సెన్స్ ఏం చెప్పిందంటే..

ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (18:48 IST)
బాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి శనివారం రాత్రి కన్నుమూసింది. ఆమె మరణ వార్త తెలియగానే దేశం యావత్తూ ఒకింత షాక్‌కు గురైంది. ఈ వార్త నుంచి తేరుకుని బాలీవుడ్ స్టార్లందరూ ట్విట్టర్ వేదికగా తమ సంతాప సందేశాలు తెలియజేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. శనివారం రాత్రి ఒంటిగంటకు అమితాబ్ తొలుత దక్షిణాఫ్రికాతో టీ - 20లో భారత్ విజయం సాధించినందుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. 
 
ఆ తర్వాత అర్థరాత్రి 1.13 నిముషాలకు ఒక పుస్తక ఆవిష్కరణకు సంబంధించిన ఫోటోను షేర్ చేశారు. చివరిగా 1.15 నిముషాలకు ఒక ఆసక్తికర ట్వీట్ చేశారు. దానిలో 'ఎందుకోగానీ, నా మనసులో ఏదో అలజడి చెలరేగుతోంది' అంటూ అందులో పేర్కొన్నారు. 
 
ఈ ట్వీట్‌ను చూసిన నెటిజన్లు అమితాబ్‌కు శ్రీదేవి మరణం ముందే తెలుసా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. అమితాబ్‌కు సిక్స్త్ సెన్స్ పనిచేసిందని అందుకే ఇలా ట్వీట్ చేశారని వ్యాఖ్యానిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు