చిక్కుల్లో కమల్ హాసన్ - బెంగుళూరు కేసు నమోదు

ఠాగూర్

గురువారం, 29 మే 2025 (18:29 IST)
అగ్ర నటుడు కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై బెంగుళూరు నగరంలో కేసు నమోదైంది. మణిరత్నం దర్శకత్వంలో తాను హీరోగా నటించిన "థగ్ లైఫ్" చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా, కమల్ హాసన్ ప్రసంగిస్తూ, తమిళ భాష నుంచి కన్నడ భాష పుట్టిందంటూ కామెంట్స్ చేశారు. 
 
ఈ వ్యాఖ్యలపై కర్నాటక రాజకీయ నేతలు, భాషా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కమల్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నాటక రక్షణ వేదిక (కేఆర్వీ) ప్రతినిధులు ఒక అడుగు ముందుకేసి కమల్ హాసన్‌పై బెంగుళూరులోని ఆర్టీ నగర్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. 
 
కమల్ వ్యాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని, కన్నడిగులు, తమిళుల మధ్య విద్వేషాలను సృష్టించేలా ఉన్నాయని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేఆర్వీ ప్రతినిధులు డిమాండ్ చేశారు. దీంతో కమల్ హాసన్‌పై కేసు నమోదుచేసినట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు