Vijay, chiru, kashmir photo
జమ్మూ & కాశ్మీర్లోని పహల్గామ్లో 26 మంది ప్రజలను పొట్టనపెట్టుకున్న ఉగ్రదాడిని ఖండిస్తూ తెలుగు చలనచిత్రరంగంలోని ప్రముఖులు ముక్తకంఠంతో సోషల్ మీడియా వేదికగా ఖండిస్తూన్నారు.అమాయక ప్రజలను మరియు పర్యాటకులను బలిగొన్న దారుణమైన దాడి భయంకరమైనది. ఈ ఘటన హృదయ విదారకమైనది. ఇది క్షమించరాని క్రూరమైన చర్య. మరణించిన వారి కుటుంబాలకు నా హృదయం సానుభూతి తెలియజేస్తుంది. వారు అనుభవించిన నష్టాన్ని ఏదీ పూరించలేదు. నా సంతాపం తెలియజేస్తున్నానని మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు.