సిరివెన్నెల ఇంటికి వెళ్ళిన ప్ర‌భాస్‌

బుధవారం, 5 జనవరి 2022 (12:41 IST)
Prabhas- Srinu
గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో మృతి చెందిన సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి ఇంటికి రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ వెళ్ళారు. నిన్న ఆయ‌న త‌న స్నేహితుడు, మేనేజ‌ర్‌ ప్ర‌భాస్ శ్రీ‌నుతో క‌లిసి హాజ‌ర‌య్యారు. గ‌త న‌వంబ‌ర్ 24న న్యూమోనియాతో బాధ‌ప‌డుతూ కిమ్స్ ఆసుప‌త్రిలో చేరిన సీతారామ‌శాస్త్రి కొద్దిరోజుల‌కే మ‌ర‌ణించారు. సినిమా ప‌రిశ్ర‌మ యావ‌త్తూ సంతాపం వ్య‌క్తం చేసింది. రెబ‌ల్‌స్టార్ కూడా ట్విట్ట‌ర్‌లో చేశారు. అప్ప‌ట్లో క‌ల‌వ‌లేక‌పోయినా ఆయ‌న వ్య‌క్తిగ‌తంగా వారి కుటుంబాన్ని క‌ల‌వాల‌ను ఆయ‌న వీలుచూసుకుని వెళ్ళారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌ను ప‌రామ‌ర్శిస్తూ, జ‌గ‌మంతా కుటుంబం. అనే పాట ఎప్పుడూ త‌న‌కు గుర్తుకు వ‌స్తుంద‌ని, సిరివెన్నెల‌గారు చ‌నిపోయాక ఆ పాటే నాకు మ‌దిలో మెదిలింద‌ని పేర్కొన్నారు. ఇక‌ ప్ర‌భాస్ రాక‌ను పుర‌స్క‌రించుకుని పోలీసులు ఆ చుట్టుప‌క్క‌ల బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ప్ర‌భాస్ లిఫ్ట్ నుంచి దిగి కింద‌కు రాగానే కారిడార్‌లోకి చుట్టు ప‌క్క‌ల యువ‌తీయువ‌కులు వ‌చ్చి ఫొటోల‌కోసం ఎగ‌బ‌డ్డారు. వారిని సెక్యూరిటీ సున్నితంగా మంద‌లించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు