చార్మీ 50 యేళ్ల మహిళ అయితే మా గురించి అలా ఆలోచించరు... పూరీ

శుక్రవారం, 19 ఆగస్టు 2022 (13:00 IST)
గత కొద్ది రోజులుగా స్టార్ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు, హీరోయిన్ చార్మీలు లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయినప్పటికీ వారు పెద్దగా స్పందించలేదు. ఈ క్రమంలో తాజాగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌తో కలిసి విజయ్ దేవరకొండ హీరోగా "లైగర్" చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 25వ తేదీన విడుదలకానుంది. ఈ నేపథ్యంలో తనకు చార్మీకి మధ్య ఉన్న రిలేషన్‌పై పూరీ జగన్నాథ్ ఓ క్లారిటీ ఇచ్చారు. 
 
"చార్మీ 50 ఏళ్ల మహిళ అయితే, ప్రజలు ఆ విషయం గురించి పెద్దగా పట్టించుకోరు. ఆమె ఊబకాయంతో ఉన్నా.. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నా, ఎవరికీ ఎలాంటి చింతా ఉండదు. కానీ,+ ఆమె (ఛార్మి) యంగ్‌ ఏజ్‌లో ఉంది కాబట్టి, ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని జనమంతా అనుకుంటున్నారు. 
 
నిజానికి ప్రతి జంటకూ ఓ రొమాంటిక్‌ యాంగిల్‌, శృంగార ఆకర్షణ ఉంటుందని నేను నమ్ముతా. అయితే, అది చాలా త్వరగా చచ్చిపోతుంది కూడా. మనందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఆ వాంఛలనేవి కొన్ని రోజులకు పోతాయని అందరికీ తెలుసు. 
 
కేవలం స్నేహం మాత్రమే కలకాలం ఉంటుంది. ఈ అమ్మాయి(ఛార్మి) 13 ఏళ్ల వయసు నుంచి నాకు తెలుసు. అంటే రెండు దశాబ్దాలుగా ఆమె గురించి తెలుసు. ఆమె ఎలా కష్టపడి పనిచేస్తుందో తెలుసు" అంటూ ఛార్మితో తనకున్న రిలేషన్‌ గురించి పూరీ జగన్నాథ్‌ ఆసక్తికరంగా జవాబిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు