ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మూవీ టీం ఇటీవలే రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ కొరియోగ్రఫీ చేసిన ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ ని భారీ సెట్ లో పూర్తి చేశారు. చాలా రిస్క్ తో కూడుకున్న ఈ ఫైట్ సీక్వెన్స్ ని హీరో సాయి దుర్గ తేజ్ చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. ఇది ప్రేక్షకులకు గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.
ప్రస్తుతం, టీం దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఒక లావిష్ సాంగ్ ని చిత్రీకరిస్తోంది. ఈ పాటలో 1,000 మంది డ్యాన్సర్స్ కనిపించబోతున్నారు. ఇది రీసెంట్ టైమ్స్ లో షూట్ చేస్తున్న అదిరిపోయే సాంగ్స్ లో ఒకటిగా నిలుస్తోంది.
ఈ చిత్రానికి వెట్రివేల్ పళనిసామి డీవోపీ, బి అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ విజయకృష్ణ ఎడిటర్. గాంధీ నడికుడికర్ ప్రొడక్షన్ డిజైనర్. ఈ పాన్ ఇండియా మూవీ సెప్టెంబర్ 25, 2025న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల కానుంది.
తారాగణం: సాయి దుర్గ తేజ్, ఐశ్వర్యలక్ష్మి, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల