సుందరం మాస్టర్ కన్నుమూత : తనికెళ్ల భరణికి ఫోన్ చేయడంతో..?

మంగళవారం, 22 మార్చి 2022 (10:29 IST)
ప్రముఖ హాస్య నాటకాల ఆద్యుడు అయినటువంటి సుందరం మాస్టర్ కన్నుమూశారు. తెలుగు నాటక రంగానికి తన హాస్యంతోనే కొత్త శైలిని చూపించిన రంగస్థల నటుడు, డైరెక్టర్, నవల రచయిత సుందరం మాస్టర్ నిన్నటి రోజున గుండెపోటుతో మృతి చెందింది. ఆయన మరణించే సమయానికి ఆయన వయసు 71 సంవత్సరాలు. 
 
ఇక ఆయన స్వస్థలం చిక్కడపల్లిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లుగా సమాచారం. అయితే నిన్నటి రోజున ఉదయం చాతిలో నొప్పి ఎక్కువగా ఉందని తన మిత్రుడు తనికెళ్ల భరణి కి ఫోన్ చేసినట్లుగా సమాచారం. 
 
ఇక ఆ వెంటనే ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు శిష్యులు ఆయన ఇంటికి చేరుకుని ఆయనను ముషీరాబాద్ కేర్ హాస్పిటల్‌లో తీసుకువెళ్లారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారు.  
 
పలువురు రంగస్థల ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. ఇక ఆయన కుమారుడు కుమార్తె యూఎస్ఏ నుంచి వచ్చిన తర్వాత ఈ నెల 23వ తేదీన జూబ్లీహిల్స్‌లో మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు సన్నిహితులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు