ఇదిలా వుండగా, మిరాయ్ సినిమాకు వస్తున్న స్పందన మామూలుగా లేదు. అందులో దర్శకుడి ప్రతిభతోపాటు సినిమాటోగ్రాఫర్ ప్రతిభ కూడా హైలైట్. అదే సినిమాకు మరింత ప్రాణం పోసింది. ఇక మిగిలించి టెక్నాలజీ. దానిని నిర్మాత విశ్వప్రసాద్ తన సొంత టీమ్ తోనే చేయించుకున్నారు. ఇక, మిరాయి సినిమా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేనికి మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ ఇచ్చారు.
తాజాగా దర్శకుడు బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. దానికి అంతకుముందు ఓ సినిమాటోగ్రాఫర్ ను అనుకున్నారు. కానీ మిరాయ్ తర్వాత కార్తీక్ ఘట్టమనేనిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కార్తికేయ 2, ధమాకా వంటి హిట్ చిత్రాలకు కార్తీక్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేశాడు. సో.. ఒక సక్సెస్ కెరీర్ ను మార్చేసింది.