శోభనం రోజే భార్యను వేలం వేసిన భర్త.. ఎక్కడ?

ఠాగూర్

బుధవారం, 13 మార్చి 2024 (13:40 IST)
సాధారణంగా చిత్రపరిశ్రమలో డేటింగ్, పెళ్లి, విడాకులు అనేవి సర్వసాధారణంగా వినిపిస్తుంటాయి. చాలా సార్లు వీటికి సంబంధించిన వార్తలు వింటుంటాం. అయితే, విడాకులు తీసుకున్న ఓ హీరోయిన్ తాజాగా ఓ సంచలన వార్తను వెల్లడించింది. తన వైవాహిక జీవితం గురించి సంచలన విషయాలను వెల్లడించారు. తన మాజీ భర్త తనను ఏకంగా వేలం పెట్టాడని చెప్పుకొచ్చింది. అదీకూడా తమ శోభనం రోజునే ఈ పనికి పాల్పడ్డాడని ఆరోపించారు. హనీమూన్​లో అతడి స్నేహితులతో కూడా కలిసి తాను సన్నిహితంగా గడపాలని బలవంతం చేసినట్లు గుర్తుచేసుకుని ఎమోషనల్ అయింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీష్మా కపూర్. 
 
తాజాగా ఆమె తన విడాకుల గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. పెళ్లైన రోజు నుంచే సంజయ్ తనను చిత్ర హింసలకు గురి చేసి, శారీరకంగా, మానసికంగా దాడి చేసి హింసించాడని చెప్పింది. పెళ్లి తర్వాత సంజయ్ హనీమూన్​ను తీసుకెళ్లి తన స్నేహితుల దగ్గర నన్ను వేలం వేశాడు. ఎవరు ఎక్కువ డబ్బు కోట్ చేస్తారో వాళ్లకు ఇస్తానని చెప్పాడు. వాళ్లతో కలిసి నేను శృంగారం చేయాలని బలవంతం చేశాడు. దీన్ని ఎప్పటికీ మర్చిపోలేని ఓ చేదు జ్ఞాపకం. ప్రెగ్నెన్సీ సమయంలో తన తల్లితోనూ నన్ను కొట్టించేందుకు ప్రయత్నించాడు. ఇలాంటివి చాలానే జరిగాయి. ఇంకా నాతో పెళ్లై తర్వాత కూడా తన మొదటి భార్యతో ఎఫైర్ కొనసాగించాడు. అంటూ చెప్పుకొచ్చింది.
 
కాగా, ఆమె సినీ కెరీర్ మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే హీరో అజయ్‌ దేవగణ్‌తో ప్రేమాయణం నడిపింది. కానీ ఇది వర్కౌట్ కాలేదు. అనంతరం అభిషేక్ బచ్చన్‌తో నిశ్చితార్థం చేసుకుంది. ఇది కూడా సఫలం కాలేదు. ఆ తర్వాత 2003లో ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్ కపూర్‌ను కరీష్మా పెళ్లాడింది. ఇతడితో పెళ్లి జరిగాక కూడా కరీష్మా కెరీర్‌ను కొనసాగించింది. ఇద్దరు బిడ్డలకు కూడా జన్మనిచ్చింది. కానీ ఆ తర్వాత సంజయ్ కపూర్‌తో మనస్పర్థలు రావడంతో 2016లో విడాకులు ఇచ్చేసింది. అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనమే అయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు