శ్రీనగర్ లో రాహుల్- ప్రియాంక గాంధీ సందడి.. కారు నెట్టుతూ..

మంగళవారం, 31 జనవరి 2023 (18:21 IST)
Rahul Gandhi
దాదాపు 150 రోజుల పాటు సాగిన భారత్ జోడో యాత్ర పూర్తయిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం కాశ్మీర్‌కు బయలుదేరారు. అక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించారు.  
 
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ, ఆయన సోదరి, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం ఉదయం శ్రీనగర్‌లోని హజరత్‌బాల్ దర్గాను, గండేర్‌బాల్‌లోని క్షీరభవాని ఆలయాన్ని సందర్శించారు. 
Rahul Gandhi
 
సోమవారం సాయంత్రం శ్రీనగర్‌లోని బౌలేవార్డ్ రోడ్డులో మంచులో కూరుకుపోయిన ఓ ప్రైవేట్ కారును గాంధీ ఇతరులతో కలిసి నెట్టారు. తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. 
 
ఈ వీడియోలో, రాహుల్ గాంధీ శ్రీనగర్‌లోని ప్రసిద్ధ దాల్ సరస్సు వెంబడి బౌలేవార్డ్ రోడ్డు వెంబడి నడుస్తూ, పడవ నడిపేవారు, స్థానిక ప్రజలతో సంభాషించడం కూడా కనిపించింది.

Rahul Gandhi

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు