ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫఏ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, యంగ్స్ టౌన్-వారెన్ ప్రాంతీయ విమానాశ్రయం నుండి ఆదివారం ఉదయం ఆరుగురు ప్రయాణికులతో బయలుదేరిన సెస్నా 441 విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.
ప్రమాదం జరిగిన ప్రాంతం చాలా కష్టతరంగా ఉందని, అక్కడికి చేరుకోవడానికి సహాయక బృందాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని హౌలాండ్ టౌన్ షిప్ అగ్నిమాపక విభాగం చీఫ్ రేమండ్ పేస్ వివరించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు.