ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ త్వరలో రాజ్యసభకు నామినేట్ కావచ్చనే ఊహాగానాలను ఆమ్ ఆద్మీ పార్టీ తోసిపుచ్చింది. వ్యాప్తి చెందుతున్న పుకార్లకు ప్రతిస్పందిస్తూ, ఆప్ వాదనలు పూర్తిగా నిరాధారమైనవని.. వాటిని కేవలం ఊహాగానాలుగా పరిగణించాలని ఆప్ పేర్కొంది.
అరోరా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, కేజ్రీవాల్ రాజ్యసభలో ఆయన స్థానంలోకి రావచ్చనే ఊహాగానాలు చెలరేగాయి. కేజ్రీవాల్ను రాజ్యసభకు పంపడం గురించి పార్టీలో ఎలాంటి చర్చలు జరగలేదని ఆప్ పంజాబ్ యూనిట్ ప్రతినిధి జగతర్ సింగ్ స్పష్టం చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఉద్దేశపూర్వకంగా ఈ పుకార్లను వ్యాప్తి చేస్తున్నాయని కేజ్రీవాల్ ఆరోపించారు.