ఢిల్లీ పోలీసులు స్వామి చైతన్యానంద సరస్వతి అలియాస్ పార్థ సారథి అనే బాబాపై కేసు నమోదు చేశారు. ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లోని అనేక మంది మహిళా విద్యార్థులపై పార్థ సారథి లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. ఆగస్టు 4న వసంత్ కుంజ్ నార్త్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. నిందితుడు ఇన్స్టిట్యూట్ నిర్వహణ కమిటీ సభ్యుడని పోలీసులు తెలిపారు.
విచారణ సమయంలో, శ్రీ శారద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్లో ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ కింద 32 మంది మహిళా పీజీడీఎం (పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్) విద్యార్థుల వాంగ్మూలాలను నమోదు చేశారు. వీరిలో 17 మంది సరస్వతి అశ్లీల సందేశాలు, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. కొంతమంది అధ్యాపకులు, నిర్వాహకులు కూడా తన డిమాండ్లను పాటించాలని విద్యార్థులను ఒత్తిడి చేశారని పోలీసులు తెలిపారు.