హైదరాబాద్ - విజయవాడ మధ్య ప్రయాణ టిక్కెట్ ధర రూ.99 మాత్రమే...

ఠాగూర్

శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (09:41 IST)
హైదరాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య ప్రయాణించే ప్రయాణికులకు ఇది నిజంగానే శుభవార్త. కేవలం 99 రూపాయలకే తమ గమ్యస్థానాలను చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్ వాహనాలు) బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈటీవో మోటార్స్‌తో కలిసి ఫ్లిక్స్ బస్ ఇండియా అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ బస్సులను గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖామంత్రి పొన్నం ప్రభాకర్ లాంఛనంగా ప్రారంభించారు.
 
ఈ సందర్భంగా ఈటీవో మోటార్స్ సీఎంవో రాజీవ్, ఫ్లిక్స్ బస్ ఇండియా ఎండీ సూర్య ఖురానా మాట్లాడుతూ, మూడు నాలుగు వారాల తర్వాత ఈ రెండు ప్రాంతాలమధ్య ఈవీ బస్సులో అందుబాటులోకి వస్తాయి. అనంతరం విజయవాడ - విశాఖపట్టణం మధ్య ఈవీ బస్సు సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు.
 
సేవలు ప్రారంభమైన తర్వాత నాలుగు వారాల పాటు హైదరాబాద్ - విజయవాడ ప్రాంతాల మధ్య కేవలం రూ.99తో ప్రయాణించవచ్చని తెలిపారు. అన్ని ప్రభుత్వ పథకాలు ఈ బస్సుల్లో వర్తిస్తాయని తెలిపారు. కేవలం ఐదు గంటల్లోనే గమ్యస్థానం చేరుకోవచ్చని వెల్లడించారు. ఈ బస్సుల్లో 49 మంది ప్రయాణించవచ్చని, రానున్న రోజుల్లో స్లీపర్ కోచ్‌ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు