భర్త అడ్డు తొలగించుకునేందుకు ప్లాన్.. ప్రియుడితో కలిసి భార్య దాడి... వైద్యుడు మృతి

ఠాగూర్

ఆదివారం, 2 మార్చి 2025 (10:24 IST)
వైద్యుడైన తన భర్త అడ్డు తొలగించుకునేందుకు ఓ భార్య తన ప్రియుడుతో కలిసి దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన భర్త ప్రాణాలు కోల్పోయాడు. దీంతో హత్యాయత్నం కేసును పోలీసులు హత్య కేసుగా మార్చారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, తెలంగాణ రాష్ట్రం హన్మకొండకు చెందిన డాక్టర్ సుమంత్ రెడ్డి (36) కాజీపేటలో క్లినికి నిర్వహిస్తున్నాడు.
 
గత నెల 20వ తేదీన కారులో ఇంటికి వెళుతుండగా బైకుపై వెంబడించిన ఇద్దరు వ్యక్తులు భట్టుపల్లి శివారులో ఆయనపై దాడి చేశారు. సుత్తితో ఆయన తలపై బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత క్షతగాత్రుడుని గుర్తించిన స్థానికులు వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం చనిపోయాడు. 9 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మృతి చెందడంతో వైద్యుడి కుటుంబంలో విషాదం నెలకొంది. 
 
మరోవైపు, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ప్రియుడి మోజులో పడిన సుమంత్ రెడ్డి భార్య ఫ్లోరా మారియా... సంగారెడ్డికి చెందిన తన ప్రియుడు ఎర్రోళ్ల శామ్యూల్, అతడి స్నేహితుడు, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మంచుకూరి రాజ్‌కుమార్‌తో కలిసి ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. దీంతో గత నెల 27వ తేదీన వారందరినీ పోలీసులు అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు