Gopichand, Meenakshi Dinesh, BVSN Prasad, Kumar Sai
గోపీచంద్, మీనాక్షి దినేష్ జంటగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ప్రొడక్షన్ నెం.39 చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. సాహసం తర్వాత గోపీచంద్ మళ్లీ ఈ బ్యానర్లో సినిమా చేస్తున్నారు. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం అధికారికంగా ప్రారంభమైంది. ఈ ఆసక్తికరమైన థ్రిల్లర్తో కుమార్ సాయి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. సాహసం తర్వాత సినిమాటోగ్రాఫర్ శామ్దత్ ISC కూడా ఈ టీంలో జాయిన్ అయ్యారు.