నారావారిపల్లిలో కుటుంబ సభ్యుల బాబు సంక్రాంతి వేడుకలు

శనివారం, 14 జనవరి 2017 (13:57 IST)
టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యుల మధ్య సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. ప్రతియేటా కుటుంబ తన స్వగ్రామం నారావారిపల్లిలోనే సంక్రాంతి వేడుకలను బాబు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెల్సిందే. ఇందుకోసం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెకు భోగికి ముందు రోజే చేరుకుంటారు. ఈ యేడాది కూడా అలానే స్వగ్రామానికి వెళ్లారు.
 
సంక్రాంతి వేడుకల్లో భాగంగా ముందుగా ఆయన తన తల్లిదండ్రులు ఖర్జూరానాయుడు, అమ్మణ్ణమ్మ సమాధుల వద్ద పూజలు నిర్వహించారు. అనంతరం ఎన్‌టిఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నారావారిపల్లి గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు బాబు. గంటకుపైగా గ్రామస్తులతో బాబు గడిపారు. నారావారిపల్లిలో చంద్రబాబునాయుడుతో పాటు ఆయన సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేష్‌, బ్రహ్మిణి, నారా రోహిత్‌లు కూడా ఉన్నారు. 

వెబ్దునియా పై చదవండి