ఈ మోడల్ విలేజ్ పథకం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుటుంబాన్ని కూడా ఆకర్షించినట్లుంది. ఈ క్రమంలో చంద్రబాబు మినహా బాబు సొంత గ్రామం నారావారిపల్లెను ఆయన కోడలు బ్రాహ్మణి దత్తత తీసుకోగా, చంద్రబాబు భార్య భువనేశ్వరి తన తల్లిగారి పుట్టిల్లు కొమురోలును దత్తత తీసుకున్నారు. ఇక చంద్రబాబు తనయుడు నారా లోకేశ్... తన తాత, దివంగత నేత ఎన్టీ రామారావు సొంతూరు నిమ్మకూరును దత్తత తీసుకున్నారు.