ఏపీ శాసనసభలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (19:12 IST)
అమరావతి : శాసనసభలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయం 6వ బ్లాక్ శాసనసభ భవనంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ నెల 15వ తేదీ ఉదయం 8.15 గంటలకు స్పీకర్ కోడెల శివప్రసాద రావు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. శాసనస మండలిలో మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఉదయం 7.45 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు