రూ.25 కోట్ల వ్యయంతో సీఎం రమేష్ తనయుడి నిశ్చితార్థం..(Video)

సోమవారం, 25 నవంబరు 2019 (13:24 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఇపుడు ఓ అంశంపై తెగ చర్చ సాగుతోంది. అదే... టీడీపీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ నిశ్చితార్థం. ఈ వేడుక ఆదివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేదిక ఆపరేషన్ ఆకర్ష్‌కు వేదిక అయిందనే ప్రచారం సాగుతోంది. 
 
రిత్విక్‌తో ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజ నిశ్చితార్థం జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ, వైఎస్సార్‌ సీపీ నేతలను బీజేపీలో చేర్చుకునేందకు బీజేపీ ఈ ఈవెంట్‌ను వాడుకుందనే రూమర్స్ విస్తృతంగా వ్యాపించాయి. 
 
ఇవన్నీ పక్కనబెడితే కొడుకు నిశ్చితార్థాన్ని సీఎం రమేశ్ ఓ రేంజ్‌లో ప్లాన్ చేశారు. దుబాయ్‌లో రూ.25 కోట్ల ఖర్చుతో అతిరథమహారథుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కాగా అతిథుల కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు బుక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఏపీలోని అన్నీ పార్టీల నాయకులతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ స్టార్స్ ఈ వేడుకకు హాజరయ్యారు. దాదాపు 75 మంది ఎంపీలను సీఎం రమేశ్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు సమాచారం.
 
ఇదిలావుండగా, కుమారుడి నిశ్చితార్థం సందర్భంగా సీఎం రమేశ్ దంపతులు వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ నటించిన 'అత్తారింటికి దారేది' చిత్రంలోని అమ్మో.. బాపుగారి బొమ్మో.. సాంగ్‌కి ఈ కపుల్ అదిరిపోయే లెవల్లో డ్యాన్స్ చేశారట. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా చప్పట్లతో హోరెత్తించారు. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు