డ్రైవ్ ఇన్ థియేటర్గా పేరుపొందిన బహిరంగ సినీ వేదిక త్వరలో విశాఖనగరం సొంతం కానుంది. కారు దిగకుండా, కాలు కింద పెట్టకుండా థియేటర్కు వెళ్లి సినిమా చూసే అవకాశం విశాఖ ప్రజలకు త్వరలో అందుబాటులోకి రానుంది. కుటుంబంతో పాటు కార్లోనే కూర్చుని హాయిగా సినిమా చూడొచ్చు. తినడానికి ఏం కావాలన్నా కారు దగ్గరకే వస్తాయి.
ముంబై, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా వంటి నాలుగు నగరాల్లోనే ఇలాంటి థియేటర్లు ఉన్నాయి. ఇలాంటి థియేటర్ ప్రస్తుతం ఏపీకి రానుంది. విదేశీ పరిజ్ఞానంతో విశాఖ ఎయిర్పోర్టుకు సమీపంలో షీలానగర్ వద్ద ఎస్టీబీఎల్ సినీ వరల్డ్ ఈ డ్రైవ్ ఇన్ థియేటర్ను నిర్మిస్తోంది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయిన నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా త్వరలో ఇది ఆవిష్కృతం కానుంది.
* 90 అడుగుల వెడల్పు, 40 అడుగుల ఎత్తుతో స్క్రీన్ ఉంటుంది.
* ఇక్కడే రెస్టారెంట్ సౌకర్యం ఉంటుంది.
* ప్రతిరోజూ ఫస్ట్ షో, సెకండ్ షో ప్రదర్శిస్తారు. తెరపై బొమ్మ కనిపించినా.. కారులోని ఎఫ్ఎమ్ ద్వారా మాటలు, పాటలు వినిపిస్తాయి.