కోవిడ్ కర్ఫ్యూ కావలిలో మహిళా ఉద్యోగి ప్రాణం తీసింది

బుధవారం, 5 మే 2021 (22:50 IST)
కావలి ఆర్డీవో కార్యాలయంలో పనిచేసే ఉద్యోగి సంధ్య రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. నెల్లూరు నగరంలో నివసిస్తున్న ఈమె కర్ఫ్యూ వల్ల తిరుగు ప్రయాణంలో బస్సులు ఉండవని స్కూటీపై వచ్చారు.

విధి నిర్వహణ అనంతరం ఇంటికి వెళ్తుండగా  దగదర్తి మండలం సున్నపుబట్టీ వద్ద ప్రమాదవశాత్తూ మరణించారు. మామూలుగా  డ్యూటీకి రోజు బస్సులో వచ్చి బస్సులో వెళ్లేవారు. కర్ఫ్యూ కారణంగా స్కూటీపై వెళ్తూ ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు