అమ్మాయిలకు శుభవార్త చెప్పిన సీఎం జగన్

బుధవారం, 13 ఏప్రియల్ 2022 (18:53 IST)
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అమ్మాయిలకు శుభవార్త చెప్పారు. అమ్మాయిల కోసం ప్రత్యేకంగా కాలేజీలు ఏర్పాటు చేయాలని జగన్ నిర్ణయించారు. 
 
నాడు-నేడు కింద 468 జూనియర్‌ కళాశాలల్లో పనులు నిర్వహించాలని, ప్రతి మండలానికీ రెండు జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని బుధవారం అధికారులను ఆదేశించారు. 
 
వీటిలో అమ్మాయిల కోసం ప్రత్యేక కాలేజీలు వుండాలన్నారు. ఈ కాలేజీల ఏర్పాటుకు దాదాపుగా రూ. 960 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు జగన్‌కు వివరించారు.
 
ఈ నేపథ్యంలో నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్‌ పూర్తి చేశామని, విడతల వారీగా ఆరు కేటగిరీల స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. జులై 2024 నాటికి సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమాన్ని పూర్తి చేయండని జగన్ అన్నారు.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు