దేవాన్ష్ హెరిటేజ్ పాలే తాగుతున్నాడు.. మా పాలలో కల్తీ లేదు: నారా బ్రాహ్మణి

శుక్రవారం, 2 జూన్ 2017 (10:02 IST)
సీఎం చంద్రబాబు నాయుడు 2700 కిలోమీటర్ల దూరం పాదయాత్ర చేసినప్పుడు కూడా తమ సంస్థ పాలే తాగారని.. హెరిటేజ్ ఫుడ్స్ ఈడీ నారా బ్రాహ్మణి స్పష్టం చేశారు. హెరిటేజ్ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని.. రెండు సంవత్సరాల తన కుమారుడు దేవాన్ష్ సైతం నిత్యం ఆ పాలే తాగుతాడని నారా బ్రాహ్మణి చెప్పారు.

హెరిటేజ్‌ పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు కెమికల్స్ కలుపుతున్నారని తమిళనాడు మంత్రి రాజేంద్ర బాలాజీ చేసిన ఆరోపణలపై స్పందించారు. 
 
తమ పాలలో కల్తీ ఎంతమాత్రమూ లేదని, గడచిన 25 సంవత్సరాలుగా తాము నాణ్యతకే ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. సమీప భవిష్యత్తులో టర్నోవర్‌ను రూ.6వేల కోట్లకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామన్నారు. పాలను సేకరించేందుకు నాణ్యమైన క్యాన్‌లు మాత్రమే వాడుతున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి