జగన్ గారు నన్ను సూర్యుడు దగ్గరికి వెళ్లమన్నా వెళ్లిపోయేదాన్ని: కన్నీరు పెట్టుకున్న వైఎస్ షర్మిల

ఐవీఆర్

శనివారం, 26 అక్టోబరు 2024 (19:29 IST)
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకోసం ఏం చేసారో ఒక్కటి చెబితే వినాలని వుందని వైఎస్ షర్మిల అన్నారు. ఆస్తుల వ్యవహారంపై షర్మిల మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... '' నాకు, నా బిడ్డలకు జగన్ గారు అన్యాయం చేస్తున్నారు అన్నది పచ్చినిజం. అలాంటి జగన్ గారిని వైసిపి కార్యకర్తలు మోస్తున్నారు. 5 సంవత్సరాలు హక్కు పత్రాలు నా చేతుల్లో వున్నాయి. అవి బయటకుపోతే వైఎస్సార్ గురించి నలుగురు నాలుగు మాటలు మాట్లాడుతారు.
 

జగన్ నాయకుడా .. శాడిస్టా : షర్మిల

ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నాను , చిన్నప్పుడే పడేసుండాల్సింది అని కాకుండా .. నాకెందుకు చావు రావట్లేదు అని విజయలక్ష్మి గారు ఏడుస్తోంది. జగన్ రెడ్డి .. నాయకుడా , శాడిస్టా అనేది వైసీపీ అభిమానులు నిర్ణయించుకోండి ! pic.twitter.com/Vb3dsrxsu8

— Telugu360 (@Telugu360) October 26, 2024
అలాంటి ఎంఓయు పత్రాలు ఈరోజు ఇంతమంది చేతుల్లో ఎందుకు వున్నాయి. విజయమ్మగారిని కోర్టుకు ఈడ్చింది ఎవరు? జగన్ మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలను సైతం లెక్కచేయలేదు. 3200 కి.మీ పాదయాత్ర చేసాను. పాదయాత్రకు వెళ్లు అంటే నా బిడ్డలను వదిలిపెట్టేసి వెళ్లిపోయాను. నన్ను సూర్యుడి దగ్గరకి వెళ్లమన్నా వెళ్లిపోయేదాన్ని" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు