వివరాల్లోకి వెళితే కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన బానోతు శ్యామల(25) సత్యభాస్కర్ ఇంటర్ కళాశాలలో చదువుతున్న సమయంలో స్థానిక ఇంతియాజ్ అలీతో పరిచయమైంది. శ్యామల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న అతను ప్రేమ పేరుతో లోబరుచుకున్నాడు. ఆపై పెళ్లి చేసుకోకుండా కాపురం చేశాడు. వీరిద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. ఆపై ఆమెను వదిలించుకునేందుకు దుబాయ్ వెళ్ళిపోయాడు.