'ఆరోగ్యమిత్ర బుక్ లెట్' ను ఆవిష్కరించిన కృష్ణా జిల్లా కలెక్టర్

గురువారం, 5 నవంబరు 2020 (07:11 IST)
ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం  వారిచే రూపొందించి అమలు చేయ బడుచున్న డా వైస్సార్ ఆరోగ్య శ్రీ హెల్త్ స్కీం  కృష్ణా జిల్లా, ఆరోగ్య మిత్ర యొక్క విధి విధానాలకు సంబందించిన పుస్తకాన్ని బుధవారం కలెక్టర్ ఇంతియాజ్ ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా కలెక్టర్ ఏ.యండి. ఇంతియాజ్ మాట్లాడుతూ డా. వై.యస్.ఆర్ ఆరోగ్యశ్రీ, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్, వర్కింగ్ జర్నలిస్టుల హెల్క్ స్కీమ్, ఆరోగ్య రక్ష, అమృత హెల్త్ స్కీమ్, 104 సేవా కేంద్రం, వై.యస్.ఆర్. టెలీమెడిసిన్ లకు సంబంధించిన సమగ్ర సమాచారం ఇందులో పొందుపరచబడిందని చెప్పారు.
 
వీటితో పాటు జిల్లాలో హెల్త్ స్కీమ్ నకు సంబంధించి ఆమోదించబడిన ఆసుపత్రుల వివరాలు, క్షేత్ర స్థాయి సిబ్బంది విధులకు సంబంధించిన పూర్తి సమాచారం కూడా అందుబాటులో ఉందని ఆయన స్పష్టం చేసారు. 
 
ఇది ప్రతీ ఒక్కరికీ అవసరమైన బుక్ లెట్ అని, దీనిలో గల సమగ్ర సమాచారం వలన జిల్లాలో అందే వైద్య సేవలపై ప్రతీ ఒక్కరికీ పూర్తి అవగాహన కలుగుతుందని కలెక్టర్ వివరించారు. 
                              
ఈ  కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (హెల్త్ అండ్ డెవలప్మెంట్ ), వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. యం. సుహాసిని, జిల్లా కో ఆర్డినేటర్ డా. వై .బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు