లాక్ డౌన్.. రోడ్డుపై చిరుత.. హడలిపోయిన జనం.. చివరికి?

గురువారం, 14 మే 2020 (09:58 IST)
లాక్ డౌన్ కారణంగా రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. దీంతో అడవుల్లో నివసించే క్రూర మృగాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాదులో రోడ్లపై నెమళ్లు విహరిస్తూ కనిపించాయి. 
 
తాజాగా హైదరాబాద్‌లోని మైలార్దేవ్ పల్లిలోనపి అండర్ పాస్ బ్రిడ్జి వద్ద ఓ చిరుత కనిపించడంతో అందరూ హడలిపాయారు. జనాలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఆ చిరుత గాయపడిందని.. అందుకే కదలలేని పరిస్థితిలో అలాగే కూర్చుండిపోయిందని చెప్తున్నారు. 
 
ఇక చిరుత దృశ్యాలు స్థానికులు సెల్‌ఫోన్‌లో బంధించారు. చిరుత సంచారంపై స్థానికులు అధికారులకు సమాచారమిచ్చారు. అయితే ఈ చిరుత ఎక్కడ నుంచి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ సిబ్బంది వచ్చి విచారించిన తర్వాత తెలియనుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు