హీరో ప్రభాస్పై తనకున్న అభిప్రాయం తప్పని ఆయనతో కలిసి జర్నీ చేసిన తర్వాత తెలుసుకున్నట్టు హీరోయిన్ మాళవికా మోహనన్ అన్నారు. ముఖ్యంగా, ప్రభాస్ సైలెంట్గా ఉంటారని అనుకున్నారనని కానీ ఆయన అలాంటి వ్యక్తికాదని, ఆయన సెట్లో ఉంటే ఆ కిక్కే వేరబ్బా అని చెప్పుకొచ్చారు. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రభాస్తో కలిసి "ది రాజాసాబ్" అనే చిత్రంలో నటించినట్టు చెప్పారు. ఆ సమయంలో ప్రభాస్ గురించి అనేక విషయాలు తెలుసుకున్నట్టు తెలిపారు.
"ప్రభాస్ను కలవక ముందు, పలు ఇంటర్వ్యూల్లో ఆయన్ని చూసి తన ఇతరులతో పెద్దగా కలవరనుకున్నా... చాలా సెలెంట్గా ఉంటారనిపించింది. కానీ, ఈ సినిమా వల్ల ఆయన విషయంలో నా ఆలోచన తప్పని అర్థమైంది. ఆయన ఎంతో సరదాగా ఉంటుంది. ఒక్క డల్ మూమెంట్ కూడా ఉండదు" అని మాళవికా మోహనన్ అన్నారు. ఈ సినిమా టీజర్ అతి త్వరలో విడుదలయ్యే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ప్రేక్షకులు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని అన్నారు.