నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండంలోని అక్కెనపల్లి గ్రామానికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన కళమ్మ రెడ్డి అనే మహిళ క్షుద్రపూజల్లో పాల్గొనాల్సిందిగా ఒప్పించింది. ఈ యేడాది జనవరి 29వ, తేదీ నుంచి ఇంటి నుండి బాలికను కళమ్మ రెడ్డి తీసుకెళ్ళింది. మోత్కూరు మండలంలోని అనాజిపురంలో నిజామాబాద్కు చెందిన మట్టి వినోద్ కుమార్, రాజు, వినోద్లకు బాలికను అప్పగించింది.
అయితే ఈ నెల 13వ, తేదీన కళమ్మ రెడ్డి మళ్ళీ బాలికను మభ్యపెట్టింది. ఇప్పుడు వెళ్తే డబ్బులు వస్తాయంటూ తీసుకెళ్ళింది. నెమ్మాని గ్రామానికి చెందిన అలుగుబెల్లి రాజశేఖర్ రెడ్డి ఇంట్లో ఉంచింది. నెమ్మాని ఎంపిటీసి సభ్యురాలి భర్త ఉయ్యా వెంకన్నతో పాటు మరికొందరు వ్యక్తులు బాలికపై ఈ నెల 15వ, తేదీ వరకు అత్యాచారానికి పాల్పడ్డారు.