జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, సొంత సోదరుడు పవన్ కళ్యాణ్ తిరుపతిలో నిర్వహించిన మీటింగ్తో మెగాస్టార్ చిరంజీవితో పాటు.. ఇతర కాపు నేతలు కూడా మేల్కొన్నారు. దీంతో కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాంగ్రెస్ నేత చిరంజీవితో సోమవారం సమావేశం కానున్నారు. అలాగే, మంగళవారం ప్రముఖ నిర్మాత, కాపు నేత దాసరి నారాయణ రావు ఇంట్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను చర్చించనున్నారు.
ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ నేత చిరంజీవితో ముద్రగడ భేటీ కానున్నారు. కాపు రిజర్వేషన్లు, ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే మంగళవారం దాసరి ఇంట్లో ముద్రగడతో పాటు కాపు సంఘానికి చెందిన ప్రముఖ నేతలు సమావేశం అవుతారని తెలిసింది. తదుపరి ఉద్యమ కార్యాచరణను ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.