పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన తొమ్మిదో తరగతి విద్యార్థిని

శనివారం, 26 ఫిబ్రవరి 2022 (15:52 IST)
విజయనగరం, బొబ్బిలిలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక మగబిడ్డకు జన్మనిచ్చింది. దీనిపై గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు పాఠశాలకు శుక్రవారం వచ్చి ఆరా తీసినట్టు సమాచారం. 
 
విద్యార్థిని ప్రసవించేంత వరకూ ఆమె కదలికలు, శరీరాకృతిని సిబ్బంది గుర్తించలేకపోవడంపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
బిడ్డతో కలిపి బాలికను కొమరాడ మండలంలోని స్వగ్రామానికి ఆటోలో పంపించినట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు