పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అనంతపురం వేదికగా మూడో బహిరంగ సభకు పక్కా ప్లాన్ చేసుకున్నారు. తొలి సభను తిరుపతిలో రెండో సభను కాకినాడలో నిర్వహించిన పవన్ కల్యాణ్ మూడో సభను అనంతపురం వేదికగా జరిపేందుకు సన్నద్ధమవుతున్నారు. తొలి సభలో ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి వినిపించేలా హిందీలో మాట్లాడిన పవన్ కల్యాణ్, రెండోసారిగా కాకినాడలో జరిగిన సభలో భారాన్నంతా పార్టీలపై వేసేసి చేయి దులుపుకున్నారు. ఇక మూడో సభలో పవన్ ఏం అంశంపై మాట్లాడుతారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
జనసేన వర్గాల సమాచారం మేరకు.. పార్టీ విస్తరణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదా అవసరాన్ని ప్రజలకు పవన్ తెలియజెప్తారని తెలుస్తోంది. సామాజిక సమస్యలపై అనంతపురంలో పవన్ వివరిస్తారని తెలుస్తోంది. ఈ సభను నవంబర్ 10న నిర్వహించనున్నారు. కరవు జిల్లా అనంతపురంను పవన్ కల్యాణ్ ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే కనబడుతోంది.