వరకట్నానికి వ్యతిరేకంగా ఎన్నో రకాలుగా ప్రచారం జరుగుతున్నా... ఈ పిశాచి మాత్రం సమాజాన్ని వీడిపోయేలా కనిపించడం లేదు. తాజాగా ఓ వరుడు.. తనకు కట్నం కింద కారు ఇవ్వలేదన్న కోపంతో వివాహమైన 2 గంటలకే తలాక్ చెప్పేశాడు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కన్నీటిపర్యంతమైందా యువతి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మీరట్లో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...