షాకింగ్ న్యూస్: టెట్ పరీక్షలు బాగా రాయలేదన్న మనస్తాపంతో ఆ యువతి ఏం చేసిందో తెలుసా?

మంగళవారం, 21 జూన్ 2016 (13:25 IST)
నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో ఓ విషాదకర సంఘటన జరిగింది. టెట్ పరీక్షలు బాగా రాయలేదన్న మనస్తాపంతో ఓ యువతి వేగంగా వస్తున్న రైలు కిందపడి ప్రాణాలు తీసుకుంది. ఈనెల 18వ తేదీన ఈ విషాదకర సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. 
 
నిజామాబాద్ జిల్లాకు చెందిన సుస్మిత అనే 25 యేళ్ళ యువతి హైదరాబాద్‌లో జరిగిన టెట్ పరీక్షకు హాజరైంది. ఈ పరీక్షను ఆమె సరిగ్గా రాయలేదు. ఇది ఆమెను బాగా కుంగదీసింది. పైగా ఈ పరీక్షలో పాస్ కాలేనన్న అపనమ్మకం ఆమెలో బలంగా నాటుకుపోయింది. 
 
ఆ తర్వాత హైదరాబాద్ నుంచి నిజామాబాద్‌కు తిరుగుపయనమైంది. కామారెడ్డి స్టేషన్‌కు ముందు.. ఆ యువతి ప్రయాణిస్తున్న రైలుకు సిగ్నల్ లేకపోవడంతో ఆగింది. అదేసమయంలో మరో ట్రాక్‌పై ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ అమితవేగంతో వస్తోంది. దీన్ని గమనించిన ఆ యువతి.. ఉన్నట్టుండి రైలు దిగి.. వేగంగా వస్తున్న ఇంటర్ సిటీ రైలుకింద పడిపోయింది. దీంతో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. 
 
లెవల్ క్రాసింగ్ వద్ద సరదాగా సెల్‌ఫోన్‌లో వీడియో తీసిన ఓ యువకుడు హఠాత్తుగా ఆమె ట్రైన్ కిందపడటం చూసి షాకై, వీడియో తీశాడు. ఆ తర్వాత యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియో చూసిన వారంతా భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు ఈ వీడియో పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి