పోలీసు శాఖలో ఉన్న 20వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి వుంది..

సెల్వి

గురువారం, 25 జులై 2024 (09:36 IST)
పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న 20వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తానని అనిత తెలిపారు. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. 
 
బుధవారం రాష్ట్ర శాసనమండలిలో ఎమ్మెల్సీలు కెఎస్‌ లక్ష్మణరావు, ఇల్లా వెంకటేశ్వరరావు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిస్తూ గత వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం పోలీసు శాఖను నిర్లక్ష్యం చేసిందన్నారు. 
 
పోలీసులకు సరిపడా వాహనాలు లేవని, డిపార్ట్‌మెంట్‌లో సిబ్బంది కొరత ఉందన్నారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య పెరిగిపోయిందని, సిబ్బందిపై పని ఒత్తిడి పెరిగిందని హోంమంత్రి దృష్టికి తెచ్చారు. 
 
చాలా నగరాల్లో క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు పనిచేయడం లేదని, శాఖను పటిష్టం చేస్తామని చెప్పారు. 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి సంబంధించి హైకోర్టులో కేసు వేసినట్లు ఆమె తెలిపారు. త్వరలోనే ఈ కేసు పరిష్కారమవుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు