వేసవి రద్దీ.. విజయవాడ మీదుగా ప్రత్యేక రైళ్ళు

మంగళవారం, 2 మే 2023 (09:51 IST)
వేసవి సీజన్‌లో ప్రయాణికుల రద్దీ నానాటికీ పెరిగిపోతుంది. దీంతో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఇందులోభాగంగా, విజయవాడ మీదుగా పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడిపేలా చర్యలు చేపట్టినట్టు రైల్వే అధికారులు తెలిపారు.
 
విశాఖపట్నం - మహబూబ్‌నగర్‌ ప్రత్యేక రైలు మంగళవారం(2వ తేదీ) నుంచి జూన్‌ 28వ తేదీ వరకు విశాఖపట్నంలో సాయంత్రం 5.35 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.30 గంటలకు మహబూబ్‌నగర్‌ చేరుకుంటుంది. 
 
తిరుగు ప్రయాణంలో ఇదే రైలు మహబూబ్‌నగర్‌లో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజ్‌గిరి, కాచిగూడ, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతుంది. 
 
అలాగే, విశాఖపట్నం - తిరుపతి ప్రత్యేక రైలు 2వ తేదీ నుంచి జూన్‌ 27వ తేదీ వరకు విశాఖపట్నంలో రాత్రి 7.10 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9.15 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. 
 
తిరుగు ప్రయాణంలో ఇదే బండి తిరుపతిలో రాత్రి 9.55 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.15 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. 
 
విశాఖపట్నం - బెంగళూరు ప్రత్యేక రైలు ఈ నెల 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు విశాఖపట్నంలో మధ్యాహ్నం 3.55 గంటలకు బయలుదేరి మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. 
 
తిరుగు ప్రయాణంలో బెంగళూరులో మధ్యాహ్నం 3.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, కుప్పం, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు