కూల్‌డ్రింక్స్‌గా పొరబడి పురుగుల మందు సేవించారు...

గురువారం, 14 నవంబరు 2019 (15:03 IST)
తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధిపేట జిల్లాలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. కూల్‌డ్రింక్స్ అని పొరబడి పురుగుల మందు సేవించారు. దీంతో వారు అపస్మారకస్థితికి చేరుకుని ప్రాణాలు కోల్పోయారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లికి సమీపంలోని పిట్టలగూడెంకు చెందిన తుమ్మల భాస్కర్(12), బన్నీ(11) అనే విద్యార్థులు బుధవారం పాఠశాల ముగిశాక ఇంటి పక్కనే ఉన్న పత్తి చేనులోకి ఆడుకోవడానికి వెళ్లారు. 
 
చేనులో కనిపించిన పత్తి మందును తెలియక తాగారు. కొద్దిసేపట్లోనే ఇంటికి వచ్చి అపస్మారక స్థితికి చేరుకున్నారు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన చిన్నారులను చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు