విద్యార్థులకు అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వ పరీక్షల విభాగం

గురువారం, 16 నవంబరు 2023 (15:19 IST)
ప్రభుత్వ పరీక్షల విభాగం విద్యార్థులకు అలెర్ట్ ప్రకటించింది. వార్షిక పరీక్షల ఫీజుకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే విడుదలైంది. నవంబర్ 17వ తేదీ లోపు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి వుంటుంది. కానీ గడువు సమయం దగ్గర పడిన నేపథ్యంలో సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది. 
 
పదోతరగతి వార్షిక పరీక్షల ఫీజును డిసెంబర్‌ 2 వరకు చెల్లించవచ్చని ప్ర‌భుత్వ ప‌రీక్ష‌ల విభాగం వెల్లడించింది. ఈ మేరకు ప్రకటను విడుదల చేసింది. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 12 వరకు ఫీజు చెల్లించవచ్చు. 
 
ఇక రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబర్‌ 21 వరకు రూ.500 ఆలస్య రుసుముతో జనవరి 3 వరకు చెల్లించవచ్చని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రూ.500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించడానికి చివరితేది - 03.01.2024.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు