పాకెట్ మనీని విరాళంగా ఇచ్చిన చిన్నారులు.. చంద్రబాబు కితాబు (వీడియో)

సెల్వి

సోమవారం, 9 సెప్టెంబరు 2024 (16:25 IST)
Students
పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడు మండలం పడమర విప్పర్రులోని శ్రీ విద్యా నికేతన్ పాఠశాలకు చెందిన ఈ చిన్నారులు వరద బాధితుల కోసం తమ వంతు సాయం చేశారు. ఈ వీడియో తనను ఎంతగానో కదిలించిందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్‌లో పోస్టు చేశారు. 
 
విజయవాడ వరద బాధితులను ఆదుకోవడానికి తమ పాకెట్ మనీని విరాళంగా ఇవ్వడం ద్వారా ఆ చిన్నారులు అసాధారణ దయాగుణాన్ని ప్రదర్శించారు.
 
విద్యార్థుల్లో ఇలాంటి ఉదాత్తమైన విలువలను పెంపొందించడం, అవసరమైన వారి పట్ల శ్రద్ధ వహించడం, ప్రాముఖ్యతను వారికి బోధించిన పాఠశాల యాజమాన్యాన్ని తాను అభినందిస్తున్నానని చంద్రబాబు కొనియాడారు. 
 
ఇటువంటి మంచి కార్యాలు మానవత్వంపై మన విశ్వాసాన్ని పునరుద్ధరిస్తాయని.. దయగల, బాధ్యతగల పౌరులు భవిష్యత్తును ఎంతగానో తీర్చిదిద్దుతారని చంద్రబాబు అన్నారు.

This video truly made my day! These little students of Sri Vidya Niketan School in Padamara Vipparru, Pentapadu Mandal, West Godavari Dist. have shown extraordinary compassion by donating their pocket money to support Vijayawada’s flood victims. I commend the school management… pic.twitter.com/jh6rfrIMY4

— N Chandrababu Naidu (@ncbn) September 9, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు