రెండు నెలల్లో అమరావతి నిర్మాణం.. నారా లోకేష్

సెల్వి

శనివారం, 23 మార్చి 2024 (13:00 IST)
రెండు నెలల్లో అమరావతి నిర్మాణం చేపడతామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం విధించిన విద్యుత్ చార్జీలు, పన్నుల భారాన్ని తగ్గించుకుంటామని కూడా లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు.
 
మంగళగిరి మండలం తాడేపల్లి మండలం నవులూరు బేతపూడిలో లోకేష్ రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను లోకేశ్ ప్రస్తావించారు. 
 
గత ఐదేళ్లుగా తమకు ఇచ్చిన హామీలను వైసీపీ మంత్రులు నెరవేర్చలేదని, తమను అవహేళన చేయడంతోపాటు భూములు కేటాయించి కౌలు చెల్లించలేదని రైతులు వాపోయారు. 
 
టీడీపీ అధికారంలోకి రాగానే అమరావతి అభివృద్ధికి శ్రీకారం చుట్టి రైతులకు బకాయిలు చెల్లిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. 
 
ఇంకా భూసమీకరణ కింద భూమి ఇవ్వని వారితో చర్చలు జరుపుతామని, రాజధాని నిర్మాణానికి అంతరాయం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు