ఒక్క రోజే భారీగా తగ్గిపోయిన పసిడి ధర

ఠాగూర్

బుధవారం, 22 అక్టోబరు 2025 (17:47 IST)
హైదరాబాద్ నగరంలో పసిడి ధరలు ఒక్కసారిగా తగ్గాయి. క్రితం రోజుతో పోలిస్తే దాదాపు 9 వేల రూపాయలకు పైగా ధర తగ్గింది. అటు వెండి ధర కూడా దిగివచ్చింది. రికార్డు ధరలతో ఇటీవల ఆకాశాన్నంటిన బంగారం, వెండిధరలు బుధవారం కాస్త తగ్గుముఖం పట్టాయి. 
 
బుధవారం సాయంత్రం 4 గంటల సమయానికి హైదరాబాద్ మార్కెట్‌లో 24 గ్రాముల మేలిమి 10 గ్రాముల పుత్తడి ధర రూ.1,25,250కి పడిపోయింది. 22 క్యారెట్ల ధర రూ.1,14,843గా ఉంది. ఇక వెండి ధర దాదాపు రూ.7 వేలు తగ్గింది. నేడు కేజీ వెండి ధర రూ.15,800 పలుకుతోంది. వెండి ధర వారం రోజుల్లో దాదాపు రూ.25 వేలు తగ్గింది. 
 
అంతర్జాతీయ విఫణిలో ఔన్సు బంగారం ధర 4022డాలర్లకు పడిపోయింది. వెండి ధర 47.84 డాలర్లకు చేరింది. ఇటీవల రికార్డు గరిష్టాలకు చేరిన బంగారం ధర వెండి లోహాల్లో మదుపర్లు లాభార్జనకు దిగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు కాస్త ఉపశమించడం ఇందుకు కారణాలుగా బులియన్ ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు