ప్రపంచ డిజిటల్ రారాజు ఇండియానే.. జియో దెబ్బకు వెనుకబడిన అమెరికా, అడ్రస్ లేని చైనా..

మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (10:00 IST)
ప్రపంచంలో ఇతర దేశాల కంటే భారత్ వేగంగా డిజిటైజేషన్‌తో మమేకమవుతోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) పేర్కొంది. రోజూ 110 కోట్ల జీబీ డేటా ట్రాఫిక్, 220 కోట్ల వాయిస్, వీడియో నిమిషాలతో ప్రపంచంలోనే జియో అతి పెద్ద నెట్‌వర్క్‌గా అవతరించింది, మొబైల్ డేటా వినియోగంలో భారత్‌ను ఇతర దేశాల కంటే ముందంజలో నిలిపింద’’ని పేర్కొంది. జియోకు మార్చి 31 నాటికి 10 కోట్ల 80 లక్షల మంది చందాదారులు ఉన్నారని, ఈ సంఖ్య మరింత పెరుగుతోందని వెల్లడించింది. 
 
రిలయన్స్ జియో సంచలనం దేశాన్ని ఊపేసింది. మొబైల్ డేటా వినియోగాన్ని భారీగా పెంచేసింది. ఇప్పుడు దేశంలో జియో చందాదారులు వినియోగిస్తున్న మొబైల్ డేటా ఎంతో తెలుసా? అమెరికాలో అన్ని మొబైల్ నెట్‌వర్క్‌‌లపై వినియోగించే డేటా కలిపితే ఎంతో అంత. చైనా కంటే 50 శాతం ఎక్కువ. 
 

వెబ్దునియా పై చదవండి