దేశంలో పెరిగిన వెండి దిగుమతి 600 శాతం.. వివరాలేంటి?

సెల్వి

మంగళవారం, 15 అక్టోబరు 2024 (11:14 IST)
2023 కంటే ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వరకు వెండి దిగుమతి 600 శాతం పెరిగాయి. మునుముందు వెండి దిగుమతుల వృద్ధి మధ్యస్తంగా ఉంటుందని అంచనా. సెప్టెంబర్ చివరి నాటికి వెండి దిగుమతులు 6390 టన్నులుగా ఉన్నాయి.
 
గత ఏడాది తొమ్మిది నెలల్లో 914 టన్నులుగా ఉన్నాయి. ఇది 599 శాతం పెరిగింది. తొమ్మిది నెలల వ్యవధిలో, ఇది ఇప్పటికే సాధారణ వార్షిక దిగుమతులను దాటింది. అంటే దాదాపు 6000 టన్నులు.
 
సెప్టెంబరు నెలలో దిగుమతులు 80 శాతం పెరిగి 252 టన్నులకు చేరుకోగా, గతేడాదితో పోలిస్తే 140 టన్నులుగా ఉన్నాయి. దేశంలో ఇప్పటికే 600 నుంచి 700 టన్నుల వెండి ఖజానాలో ఉంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు