కరోనావైరస్ భయం, గుంటూరులో ఆసుపత్రి భవనంపై నుండి దూకేసిన పేషెంట్

శుక్రవారం, 14 ఆగస్టు 2020 (10:39 IST)
గుంటూరులో ఓ కరోనా పేషెంట్ ఆస్పత్రి భవనంపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. దీంతో తీవ్ర గాయాలవ్వడంతో ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వివరాలు ఇలా వున్నాయి... గుంటూరు మారుతీ నగర్‌కు చెందిన ఓ వృద్దుడికి కొద్దిరోజుల క్రితం కరోనా సోకింది. దీంతో మంగళగిరి మండలం చినకాకానిలోని ఎన్నారై ఆస్పత్రిలో చేరాడు.
 
అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నాడు. అదే క్రమంలో శుక్రవారం ఆగస్టు 14, ఉదయం ఆస్పత్రిలో మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని గమనించిన సిబ్బంది అతన్ని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు.
 
తీవ్ర గాయాలవ్వడంతో ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా మారింది. ఆ వృద్ధుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడటంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఇదే తరహాలో పలుచోట్ల కొన్ని ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు