విసిగిపోయిన క్రిస్ గేల్ - ఐపీఎల్ నుంచి ఇంటిముఖం పట్టాడు...

శుక్రవారం, 1 అక్టోబరు 2021 (08:14 IST)
వెస్టిండిస్ క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్‌కు రాంరాం పలికాడు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న గేల్.. త్వరలోనే ఇంటిముఖం పట్టనున్నాడు. బయోబబుల్‌తో విసిగిపోయిన గేల్ ఐపీఎల్‌ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 
 
ఐపీఎల్‌ కోసం యూఏఈలో అడుగుపెట్టడానికి ముందు గేల్ కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడాడు. అక్కడి నుంచి నేరుగా ఐపీఎల్‌కు వచ్చేశాడు. సుదీర్ఘకాలం బయోబబుల్‌లో గడపడంతో విసిగిపోయిన గేల్ ఐపీఎల్‌ను వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు పంజాబ్ కింగ్స్ యాజమాన్యం తెలిపింది. 
 
కాగా, గేల్ యూఏఈలో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. రెండింట్లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. తాను చాలా నెలలుగా బయోబబుల్‌లో ఉంటున్నానని, టీ20 ప్రపంచ కప్ కోసం మానసికంగా సిద్దమయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గేల్ తెలిపాడు. గేల్ నిర్ణయంతో అతను ప్రాతినిథ్యం వహించే జట్టుకు గట్టి ఎదురుదెబ్బలాంటిదే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు