రవీంద్ర జడేజా రెస్టారెంట్‌‌ జడ్జూస్ ఫుడ్ ఫీల్డ్‌కు కొత్త చిక్కు: ఫుడ్‌పై ఫంగస్.. నోటీసులు

శనివారం, 7 అక్టోబరు 2017 (16:59 IST)
భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా రెస్టారెంట్‌ ''జడ్డూస్‌ ఫుడ్‌ ఫీల్డ్‌'' అక్రమ నిర్మాణంగా  గత ఏడాది డిసెంబరులో వార్తల్లోకి ఎక్కింది. తాజాగా జడేజా తన సోదరితో కలిసి నిర్వహిస్తోన్న ఈ రెస్టారెంట్‌లో నాణ్యత లేదంటూ వార్తల్లో నిలిచింది. రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని హెల్త్‌ డిపార్ట్‌మెంట్‌ అధికారులు శుక్రవారం జడేజా రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు.
 
ఈ తనిఖీల్లో ఫ్రిజ్‌లో ఎక్కువ కాలంపాటు నిల్వ వుంచిన ఆహార పదార్థాలు, బేకరీ ఉత్పత్తులను కనుగొన్నారు. వీటిపై ఫంగస్ ఏర్పడటాన్ని కూడా గుర్తించారు. పరిమితికి మించి ఫుడ్‌ కలర్స్‌, అజినోమోటో వినియోగిస్తున్నట్లు డిప్యూటీ హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పీఆర్‌ రాథోడ్‌ వెల్లడించారు. 
 
ఈ రెస్టారెంట్లో విక్రయానికి ఉంచిన ఉత్పత్తులపై గడువు తేదీ కూడా లేకపోవడం.. పాడైపోయిన కూరగాయలను గుర్తించిన సిబ్బంది వాటిని సీజ్ చేశారు. నాణ్యతా ప్రమాణాలను పక్కనపెట్టి రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్న జడేజా సోదరికి అధికారులు నోటీసులు అందజేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు