ఆశ్వయుజ బహుళ చతుర్దశి "నరక చతుర్దశి"గా ప్రసిద్ధి పొందిన దీపావళి పండుగ గురించి అందరికీ బాగా తెలుసు. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు సాధు జనాలను పీడిస్తూ దేవ, మర్త్య లోకాలలో సంక్షోభాన్ని కలిగిస్తుంటాడు.
కృతయుగంలో హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామికి, భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మించిన నరకుడిని.. లోక కంటకుడైనా మహావిష్ణువు వధించరాదని, తల్లియైన తన చేతిలోనే మరణించాలని భూదేవి వరం పొందుతుంది. అలా భూదేవి, మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానునిగా, భూదేవి సత్యభామగా జన్మిస్తుంది.
అప్పటికి నరకాసురుడు లోకానికి చేస్తున్న అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామా సమేతంగా శ్రీకృష్ణుడు యుద్ధానికి తరలి వెళ్తాడు. నరకాసురుడు, శ్రీకృష్ణుల మధ్య భీకర సంగ్రామంలో భూదేవి అంశమైన సత్యభామ చేతులారా నరకాసురుడిని వధిస్తుంది.
అనంతరం తన పుత్రుని పేరు భూమిపై చిరకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు "నరక చతుర్థశి"గా పిలువబడుతుందని శ్రీకృష్ణుడు వరం ప్రసాదిస్తాడు. నరక సంహారానంతరం నరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది.
WD
నరకుని మరణానికి సంతోషంతో మర్నాడు అమావాస్య చీకటిని పారద్రోలుతూ దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి పండుగ జరుపుకోవడం.. అదే "దీపావళి" పండుగగా ప్రసిద్ది చెందడం జరిగాయి.
అటువంటి దీపావళి పండుగనాడు ఏ ఇంటియందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో..! ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి ప్రవేశిస్తుందని ఋగ్వేదం చెబుతోంది. అటువంటి పుణ్యదిన సాయం సంధ్యాకాలమందు లక్ష్మీస్వరూపమైన తులసికోట ముందు తొలుత దీపాలు వెలిగించి శ్రీ మహాలక్ష్మీని పూజించి నైవేద్యమిచ్చి..
అని ధ్యానించి, ఈ సర్వప్రాణ కోటికి హృదయ తాపాలను పోగొట్టి సర్వసంపన్న శక్తివంతురాలుగా భావించి, పూజానంతరం గృహమంతా దీపాలకృతం చేయడం ద్వారా కాలియందియలు ఘల్లు ఘల్లుమన్నట్లు ఆ మహాలక్ష్మి ఆ గృహములో ప్రసన్నమవుతుందని విశ్వాసం.