హిందూపురంలో నేనే గెలుస్తున్నా... పార్టీ ఏదిచ్చినా చేస్తా.... బాలయ్య

బుధవారం, 7 మే 2014 (20:13 IST)
WD
బుధవారం సీమాంధ్రలో జరిగిన ఎన్నికల్లో హిందూపురం నుంచి తాను భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నట్లు టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారనీ, తెదేపా అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు.

తెలుగుదేశం పార్టీలో కీలకపాత్ర పోషిస్తారా అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సూచనల మేరకే తన పాత్ర ఉంటుందని అన్నారు. ఈ ఎన్నికల్లో యువత ముందుకు వచ్చి ఓటు వేశారనీ, వారివల్లనే ఓటింగ్ శాతం పెరిగిందని చెప్పుకొచ్చారు. సీమాంధ్ర అభివృద్ధి చేయగల సత్తా ఉన్న చంద్రబాబు నాయుడికే పగ్గాలు అప్పగించేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారని అన్నారు.

వెబ్దునియా పై చదవండి